హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో క్రికెట్ మైదానాలకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు సాగు భూమిగా ఉన్న పొలాలు ఇప్పుడు క్రికెట్ మైదానాలుగా రూపాంతరం చెందుతున్నాయి. బౌరంపేటలో ఒక రైతు తన పొలాన్ని ఇలా మార్చారు. 20-25 ఓవర్ల మ్యాచ్కి సాధారణ రోజుల్లో రూ.2,000 వరకు, ఫ్లడ్లైట్లతో రూ.6,000, వారాంతాల్లో రూ.8,000 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఇది రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారింది.