Locations: Hyderabad

  • ‘ప్రభుత్వ పాఠశాలలకు ప్రోత్సాహకాలు’

    మేడ్చల్: కీసర మండలంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయమని సీఐ ఆంజనేయులు అన్నారు. పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన నాగారం ZPHS పాఠశాలకు ఎస్‌ఎస్‌సీ చాలెంజ్ ట్రోఫీ, మెమెంటో, రూ. 11 వేల నగదు బహుమతిని మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, న్యాయవాది బోడ శ్రీనివాసరావుతో కలిసి అందజేశారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు.

  • పదవులు, నిధులు కేటాయించాలి: బండిరమేష్

    HYD: గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండిరమేష్ పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన తమ నియోజకవర్గానికి పదవులు, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జై భీమ్-జై బాపు వంటి పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయంకోసం కృషి చేస్తామని, కూకట్‌పల్లికి డైరెక్టర్ పదవులు ఇవ్వాలని కోరారు.

  • విద్యా వ్యవస్థలో మార్పుల కోసం అధ్యయనం

    వికారాబాద్‌: రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సోమవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, డైట్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు. మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని మురళి చెప్పారు.

  • రోడ్డు దాటుతుండగా కారు ఢీ.. వృద్దురాలు స్పాట్‌లోనే..

    మేడ్చల్: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కారు ప్రమాదంలో 77 ఏళ్ల వృద్ధురాలు దాచారం మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఆమె ఔషాపూర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా..వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. ఇదే కారు మరో ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టడంతో దానిపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ చేయూత

    TG: సామాజిక బాధ్యతలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేత్రదానానికి తోడ్పాటు అందించేందుకు హైదరాబాద్‌లోని స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రితో సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. ‘నెట్‌వర్క్ టు సైట్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం కింద, వివిధ జిల్లాల నుంచి సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్‌లోని కంటి ఆసుపత్రికి తరలిస్తారు.

  • పేదరికంపై గెలిచి ఐఐటీలో సీటు సాధించిన నిరంజన్

    హైదరాబాద్‌కు చెందిన నిరంజన్ అనే యువకుడు తన తల్లిదండ్రుల పేదరికాన్ని అధిగమించి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించాడు. రోజువారీ కూలీలైన అతని తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ, నిరంజన్ తన ప్రతిభతో దాన్ని అధిగమించాడు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ పాఠశాలలో చదువుకున్న అతడు పగలు తరగతులకు, రాత్రిపూట ఆన్‌లైన్ శిక్షణ తరగతులకు హాజరయ్యేవాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1668 ర్యాంకు సాధించాడు.

  • శ్రీకాంత్ చేసినవాటిలో ఆ సినిమాలంటే ఇష్టం: నటి ఊహ

    టాలీవుడ్ జంట శ్రీకాంత్, ఊహలది ఆదర్శనీయమైన ప్రేమకథ. తాజాగా ఓఇంటర్వ్యూలో ఊహ తమ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ తన పేరును’ఊహ’గా మార్చారని తెలిపారు. శ్రీకాంత్‌తో కలిసి నటించిన మొదటిసినిమా ‘ఆమె’లోని పెళ్లి సీన్ తర్వాత నిజంగానే తామిద్దరం పెళ్లి చేసుకోవడం చిత్రంగా అనిపిస్తుందని చెప్పారు. శ్రీకాంత్ సినిమాలలో తనకు ‘తారకరాముడు’, ‘ఖడ్గం’ సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు.

     

  • యువకుడి హత్యకు దారితీసిన చిన్న గొడవ

    మేడ్చల్: ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దాడిలో కూలీ మరణించాడు. మృతుడు చిన్నగవని భాస్కర్(30) బోయిగూడకు చెందినవాడు. అతనితో పాటు పనిచేసే సింగారం మణిదీప్ చిన్న కారణాలకే గొడవపడేవాడు. ఆదివారం రాత్రి వారి మధ్య గొడవ జరగగా..మణిదీప్ కత్తితో భాస్కర్‌ను పొడవటంతో తీవ్రంగా గాయపడగా.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • చర్లపల్లి అభివృద్ధి పనుల సమీక్ష

    మేడ్చల్: GHMC స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  విజయవంతంగా పూర్తైన వినాయక నిమజ్జన కార్యక్రమంపై అధికారులను అభినందించారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పరిశుభ్రత పనులను సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆగిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

  • మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు

    మేడ్చల్: యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీనియర్ పాత్రికేయుడు మెరుగు చంద్రమోహన్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఏఎస్ రావు నగర్‌లోని సెంచనరీ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో జిల్లా పాత్రికేయులందరూ పాల్గొని, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరారు.