Locations: Hyderabad

  • గ్రేటర్‌లో 3.3 లక్షల గణేష్‌ విగ్రహాల నిమజ్జనం

    గ్రేటర్ హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. గ్రేటర్‌లో ఆదివారం సాయంత్రం వరకు 3.3 లక్షల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఇందుకోసం 72 కృత్రిమ కొలనులు ఏర్పాటు చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్యం, లైటింగ్, రోడ్డు మరమ్మతుల వంటి పనులను పకడ్బందీగా నిర్వహించారు. నిమజ్జనం అనంతరం 20 వేల టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించినట్లు పేర్కొన్నారు.

  • టీపీసీసీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన వజ్రేష్‌యాదవ్

    మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్‌గౌడ్ సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేష్‌యాదవ్ ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్‌గౌడ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ బలోపేతానికి, పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు.

  • HYD: ఐదేళ్లు @ 207 ‘బర్డ్ హిట్స్’

    HYD: విమానాలకు పక్షుల తాకిడి(బర్డ్ హిట్స్) పెరిగిపోవడంతో విమానయాన సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. 2020 నుంచి ఈఏడాది జూన్ వరకు దేశంలో 2,807 బర్డ్ హిట్స్ నమోదు కాగా..వీటిలో 207 హైదరాబాద్‌లోనే జరిగాయి. పక్షి తాకిడితో ఇంజిన్, రెక్కలు, విమానం ముందు భాగం దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఇది అత్యవసర ల్యాండింగ్‌కు దారితీస్తుంది. విమానాశ్రయాల చుట్టూ జనావాసాలు, ఆహార వ్యర్థాలు పెరగడం ఈసమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

  • 9 నుంచి అఖిల భారత జైల్‌ డ్యూటీ మీట్‌-2025

    తెలంగాణ జైళ్లు, సవరణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైల్ డ్యూటీమీట్-2025 ఈనెల 9 నుంచి 11వతేదీ వరకు హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరగనుంది. 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1300 మంది జైలుసిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. గవర్నర్ జిష్టుదేవ్‌వర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ముఖ్య అతిథులుగా హాజరై ఈకార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

  • బంజారాహిల్స్‌లో కొబ్బరి బోండాలు చోరీ

    HYD: బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 14లో కొబ్బరి బోండాలను ఆటో డ్రైవర్ చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి సమయంలో ఆటోలో వచ్చిన ఒక వ్యక్తి, కొబ్బరి బోండాలను కప్పి ఉన్న కవర్‌ను కత్తితో కట్ చేసి, వాటిని ఆటోలోకి ఎక్కించుకున్నాడు. ఈ చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

  • రోడ్డెక్కిన మురుగు.. పట్టించుకునేవారేరీ?

    HYD: నందిహిల్స్ నుండి వచ్చే మురుగునీరు షేక్‌పేట్-రాయదుర్గం ప్రధాన రహదారిపై ప్రవహించి వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. బీఎన్‌ఆర్ హిల్స్ సొసైటీలోని ఇళ్ల నుండి వచ్చే వ్యర్థజలాలు ప్రధాన రహదారిపైకి నేరుగా వదులుతుండటంతో రోడ్డు బురదమయంగా మారి దుర్వాసన వస్తోంది. నెలల తరబడి కొనసాగుతున్న ఈసమస్యతో స్థానికులు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈసమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.

  • చర్లపల్లి డ్రగ్స్ కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

    హైదరాబాద్ శివారు చర్లపల్లిలో వందల కోట్లరూపాయల విలువైన డ్రగ్స్ తయారీ రాకెట్‌ను మహారాష్ట్ర పోలీసులు ఛేదించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూలీల వేషంలో వచ్చి ఓ సాధారణ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తయారీతో పాటు అమ్మకాలు కూడా హైదరాబాద్‌లోనే జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు.

     

     

     

  • రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా?

    మేడ్చల్‌: ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. గుంతల మయమైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా రోడ్లకు మరమ్మతులు చేసేందుకు మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

     

  • గ్రేటర్‌ @ 31.0 డిగ్రీలు

    హైదరాబాద్‌లో ఎండలు దంచి కొడుతుండడంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ ఉక్కపోత మొదలైంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.4డిగ్రీలు, గాలిలో తేమ 54శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

  • నత్తనడకన ఫ్లైఓవర్ పనులు.. ట్రాఫిక్‌తో ఇబ్బందుల్లో ప్రజలు

    HYD: చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంతో స్థానికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు, ధూళి కాలుష్యంతో ప్రజలు విసిగిపోయారు. పనులు మొదలై నెలలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న కాంక్రీట్, ఇనుప కడ్డీలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీనితో ఉద్యోగులు, విద్యార్థులు ఆలస్యంగా చేరుకుంటున్నరని ఆందోళన వ్యక్తం చేశారు.