Locations: Hyderabad

  • బోల్లారంలో దారుణ హత్య.. యువకుడిని చంపి డోర్ డెలివరీ

    హైదరాబాద్ శివారులోని ఐడీఏ బోల్లారం మున్సిపల్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. కేబీఆర్ కాలనీలో నివసించే  జయప్రకాశ్(22)ని దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఒంగోలు జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • బైక్‌ను ఢీకొన్న కారు.. ఒకరికి తీవ్రగాయాలు

    HYD: టోలిచౌకిలోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద అతివేగంగా వచ్చిన ఓ కారు రాపిడో బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ రైడర్లు వేణు, ఆసిఫ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కారుడ్రైవర్‌తో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

     

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    HYD: కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,08,380కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.99,350 గా పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ. 1000 తగ్గి రూ.1, 37,000 వద్ద కొసాగుతుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే దరలు కొనసాగుతున్నాయి.

  • సినీ నటికి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు!

    సినీనటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్‌ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు.

  • అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో 2 రోజులు తాగునీటి సరఫరా బంద్

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 48 గంటలపాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 పథకంలో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో వాల్వ్ మార్పిడి పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ఈపనులు జరుగుతాయని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.

  • బావిలో కూలిన రోడ్డు

    రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలోని నల్లలబావి వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కూలిపోయింది. ఈ రోడ్డు బావికి ఆనుకుని ఉండటంతో వర్షపు నీరు పెరిగి రోడ్డు బావిలోకి కుంగిపోయింది. ఈ ఘటనలో 11కేవీ కరెంట్ స్తంభాలు కూడా కూలిపోవడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

  • పొద్దున ఎండలు.. సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడే చాన్స్‌

    రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో ఎండలు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. దీంతో సాధారణం కన్నా 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, రానున్న 4రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. సెప్టెంబర్ నెల మొత్తం ఎండలు, వర్షాలు రెండూ అధికంగా ఉండే అవకాశం ఉంది.

     

  • కబ్జాకు గురవుతున్న మేడికుంట చెరువు

    HYD: హైటెక్ సిటీలోని మాదాపూర్ మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోంది. గతంలో నీటితో కళకళలాడిన చెరువు ప్రస్తుతం అక్రమార్కుల చెరలో ఉంది. చెరువులో మట్టిని నింపి భారీ షెడ్లు, కారు మెకానిక్ షాపులు, టీ కొట్లు, పాన్ షాపులు వెలిశాయి. చెరువును కాపాడడానికి అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా ఆక్రమణదారులు దానిని తొలగించి కబ్జా చేస్తున్నారు. దీనిపై స్థానికులు హెచ్ఎండిఎకు ఫిర్యాదు చేశారు.

     

  • 17 ఏళ్లుగా లడ్డూను సొంతం చేసుకుంటున్న భక్తుడు

    HYD: హెచ్‌ఎఫ్‌నగర్ ఫేజ్ 1 బస్తీకి చెందిన మునేశ్వర్ అనే భక్తుడు 17 సంవత్సరాలుగా వేలం పాటల్లో లడ్డూను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాల్లో మండపం వద్ద నిర్వహించిన వేలంలో రూ. 2.10లక్షలు వెచ్చించి లడ్డూను కైవసం చేసుకున్నాడు. మొదటిసారిగా రూ.600కు కొనుగోలు చేసిన మునేశ్వర్, తర్వాత వరుసగా పదహారు సంవత్సరాలు లడ్డూనుసొంతం చేసుకుంటున్నాడు.

  • 1,100 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు..

    HYD: గణేష్ నిమజ్జనం తర్వాత రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు 800 మంది పారిశుద్ధ్య కార్మికులను మూడు షిఫ్టుల్లో పనిచేయిస్తూ, 18 వాహనాలు, 3 జేసీబీలతో 1100 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. ముఖ్యంగా ఎంజే మార్కెట్‌ నుంచి లిబర్టీ వరకు పెద్ద ఎత్తున పేరుకుపోయిన వ్యర్థాలను క్లీనింగ్ చేసి, అన్నప్రసాదాల వ్యర్థాలను నీటితో శుభ్రం చేశారు.