HYD: హైటెక్ సిటీలోని మాదాపూర్ మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోంది. గతంలో నీటితో కళకళలాడిన చెరువు ప్రస్తుతం అక్రమార్కుల చెరలో ఉంది. చెరువులో మట్టిని నింపి భారీ షెడ్లు, కారు మెకానిక్ షాపులు, టీ కొట్లు, పాన్ షాపులు వెలిశాయి. చెరువును కాపాడడానికి అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా ఆక్రమణదారులు దానిని తొలగించి కబ్జా చేస్తున్నారు. దీనిపై స్థానికులు హెచ్ఎండిఎకు ఫిర్యాదు చేశారు.