మేడ్చల్: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట గ్రామంలో వీధి కుక్కలు రెండేళ్ల బాలుడు భవిష్పై దాడి చేశాయి. ఆరుబయట ఆడుకుంటున్న బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. బాలుడిని చికిత్స కోసం సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడద గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.