Locations: Hyderabad

  • చర్లపల్లి అభివృద్ధి పనుల సమీక్ష

    మేడ్చల్: GHMC స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  విజయవంతంగా పూర్తైన వినాయక నిమజ్జన కార్యక్రమంపై అధికారులను అభినందించారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పరిశుభ్రత పనులను సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆగిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

  • మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు

    మేడ్చల్: యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీనియర్ పాత్రికేయుడు మెరుగు చంద్రమోహన్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఏఎస్ రావు నగర్‌లోని సెంచనరీ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో జిల్లా పాత్రికేయులందరూ పాల్గొని, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరారు.

  • ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

    వికారాబాద్‌: ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 83 ఫిర్యాదులు అందాయి. పెన్షన్లు, భూ సమస్యలు, గృహనిర్మాణ శాఖ, వ్యవసాయం వంటి వాటిపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. మండలాల స్పెషల్ అధికారులు గ్రామాలో పరిశుభ్రత, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను పర్యవేక్షించాలని సూచించారు.

  • రోడ్డు పనులు పరిశీలించిన మాజీ మేయర్

    మేడ్చల్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్, పర్వతాపూర్ పోచమ్మకుంటలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి పూర్తి కావడం ద్వారా పర్వతాపూర్, మేడిపల్లి, పీర్జాదిగూడ ప్రాంతాలకు రవాణా సులభతరం అవుతుందని ఆయన అన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు కోరారు.

  • ఆదుకున్న ఆర్.వి. ఫౌండేషన్

    మేడ్చల్: పీర్జాదిగూడలోని భగత్ సింగ్ కాలనీలో ప్రమాదవశాత్తు ఒక గుడిసెలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, ఆర్.వి. ఫౌండేషన్ ద్వారా తక్షణ సాయంగా 50 కిలోల బియ్యాన్ని బాధితులకు అందజేశారు. కాలనీలో నీరు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు లేకపోవడం వంటి సమస్యలను గమనించి, వాటిని పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

  • నిన్న ముస్లిం యువకుడు.. నేడు క్రిస్టియన్ యువకుడు🤗

    HYD: శ్రీరాంనగర్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. జవహర్‌నగర్‌లో ఇప్పటికే ఒక ముస్లిం యువకుడు గణేశ్ లడ్డూను దక్కించుకోగా..తాజాగా క్రిస్టియన్ యువకుడు డేవిడ్ అదే మార్గంలో నడిచాడు. అడ్డా బాయ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను డేవిడ్ వేలం పాటలో రూ.40 వేలకు దక్కించుకున్నాడు. బొట్టు పెట్టుకుని, ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అంటూ నినాదాలు చేసి మత సామరస్యాన్ని చాటాడు.

  • అమ్మ మాట కోసం జీవితాన్ని త్యాగం చేశా: నటి శ్రీలక్ష్మీ

    తెలుగు తెరపై హాస్యనటిగా వెలుగొందిన శ్రీలక్ష్మి తనజీవితంలోని కష్టాలను బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తండ్రి అమర్‌నాథ్ నష్టపోవడం, అనారోగ్యం కారణంగా కుటుంబం ఆర్థికకష్టాల్లో పడిందని ఆమె తెలిపారు. కుటుంబం బతకడం కోసం తనజీవితాన్ని త్యాగం చేయమని తల్లి అడగడంతో, నటనపై దృష్టి పెట్టానని చెప్పారు. హీరోయిన్‌గా అవకాశం వచ్చిన ‘శుభోదయం’ సినిమా సమయంలోనే తండ్రి చనిపోవడంతో ఆఅవకాశం కోల్పోయానని శ్రీలక్ష్మి అన్నారు.

  • చర్లపల్లి డ్రగ్స్ కేసు.. స్పందించిన తెలంగాణ DCA అధికారులు

    HYD: చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబరేటరీస్ డ్రగ్స్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు స్పష్టం చేశారు. వాగ్దేవి ల్యాబ్స్ ఒక కెమికల్ ఫ్యాక్టరీ అని, దానికి ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేదని తెలిపారు. వారు తయారు చేసిన ‘మెఫిడ్రోన్’ అనే పదార్థం అసలు ఔషధమే కాదని వెల్లడించారు. ఈ కేసు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డీఆర్‌ఐ పరిధిలో ఉంటుందని డీసీఏ అధికారులు పేర్కొన్నారు.

     

  • బేతేనియ ప్రార్థన మందిరం వార్షికోత్సవం

    మేడ్చల్: హైదర్ నగర్ డివిజన్, తులసి నగర్‌లో ఉన్న బేతేనియ ప్రార్థన మందిరం 25వ వార్షిక మహోత్సవానికి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కేక్ కట్ చేసి, మందిరం సభ్యులకు, యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రె.వ.ఎ.ఇ. సీయోను రాజు, జీ. సముయేలు, పాస్టర్ ఆర్. పి. దాస్, రాయుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

  • ‘రైతుల ప్రయోజనాలకే మార్కెట్ కమిటీలు’

    రంగారెడ్డి: మార్కెట్ కమిటీలు రైతుల సంక్షేమం కోసం పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి సూచించారు. సోమవారం బాటసింగారం పండ్ల మార్కెట్‌ను సందర్శించిన ఆయన, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ పనితీరును అభినందించిన ఆయన, రైతులు తీసుకొచ్చిన సరుకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో చొరవ చూపాలని అన్నారు.