Locations: Hyderabad

  • గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది: సీపీ

    హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మొత్తం 40 గంటల పాటు నిమజ్జన శోభాయాత్ర జరిగిందని, ఇంకా 900 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది విగ్రహాల ఎత్తు పెరగడం వల్ల ఊరేగింపు ఆలస్యమైందని చెప్పారు. బందోబస్తులో పాల్గొన్న పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

     

  • సీఎం సర్‌ప్రైజ్ విజిట్ మంచిదే: సీవీ ఆనంద్

    TG: గణేశ్ నిమజ్జనంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. 40 గంటల పాటు సాగిన నిమజ్జన శోభాయాత్రలో ఇప్పటివరకు 6,300 విగ్రహాలు నిమజ్జనమయ్యాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్‌ప్రైజ్ విజిట్ మంచిదేనని వ్యాఖ్యానించారు. వీఐపీల సందర్శనలు సహకరించాయని చెప్పారు. వివిధ శాఖల సమన్వయంతో నిమజ్జనం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. చిన్న విగ్రహాలతో కలిపి ఈ రోజు 25 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • హైదరాబాద్‌లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు

    HYD: గణేష్ నిమజ్జనోత్సవాలు రెండో రోజు కూడా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీ గణనాథుల విగ్రహాలను నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌, ఇతర జలాశయాల వద్దకు తరలిస్తున్నారు. భక్తుల కోలాహలం, డప్పుల వాయిద్యాలు, నృత్యాలతో నిమజ్జన శోభాయాత్రలు సందడిగా సాగుతున్నాయి. పోలీసులు నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

     

  • పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన కారు.. యువతి మృతి

    HYD: లంగర్‌హౌస్‌ దర్గా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్న డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ వాహనాన్ని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కశ్వి (20) అనే యువతి మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • మానవత్వం చాటిన మహిళా కండక్టర్

    HYD: సికింద్రాబాద్ బస్‌స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న మేడ్చల్ డిపో కండక్టర్ చక్రి మానవత్వం చాటుకున్నారు. బస్‌పాయింట్ వద్ద ఫిట్స్ వచ్చి పడిపోయిన ఓ వ్యక్తికి ఆమె సకాలంలో సహాయం చేశారు. బస్సు తాళంచెవిని అతని చేతిలో పెట్టి ప్రాథమిక చికిత్స అందించారు. చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆమె అసహనం వ్యక్తంచేశారు. కండక్టర్ చక్రి తీరును ఆర్టీసీ అధికారులు, ప్రజలు అభినందించారు.

  • నేతాజీ నగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకుల పర్యటన

    మేడ్చల్: నాగారం మున్సిపాలిటీలోని 16వ వార్డు, నేతాజీ నగర్ కాలనీని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు శ్రీనివాస్ రెడ్డికి తమ ప్రాంతంలోని సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేశవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ రావు, కుమార్, మాదిరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత

    HYD: నేడు చంద్రగ్రహణం కారణంగా హైదరాబాద్‌లోని ప్రధాన దేవాలయాలను మూసివేయనున్నారు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు మూసి ఉంచుతామని ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి, సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారని పండితులు పేర్కొన్నారు.

  • ‘మహిళలు స్వయం ఉపాధితో రాణించాలి’

    మేడ్చల్: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజ రమణ అన్నారు. ఘట్‌కేసర్‌లోని అంకుషాపూర్‌లో బతుకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్లు, అల్లికలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి రంగాలలో మహిళలు రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

     

  • రిపోర్టర్‌పై కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన

    రంగారెడ్డి: మహేశ్వరంలో విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ బిగ్ టీవీ రిపోర్టర్‌పై దురుసుగా ప్రవర్తించాడు. శ్రీచైతన్య పాఠశాలలో జరుగుతున్న వివాదాన్ని కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్‌ను అడ్డుకుని, వీడియో తీయొద్దని హెచ్చరించాడు. “నీకేం సంబంధం, బయటకు వెళ్ళు” అంటూ బెదిరించాడు. సెప్టిక్‌ట్యాంక్‌లో పడి విద్యార్థికి గాయాలైన ఘటనపై పాఠశాలపై పోలీసులు చర్యలు తీసుకోకుండా, మీడియాను అడ్డుకోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • HYDలో గణేశుడి లడ్డూకు ఫుల్ క్రేజ్

    హైదరాబాద్‌లో గణపతి లడ్డూ వేలంపాట ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ ఏడాది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మైండ్స్ కాలనీ లడ్డూ రూ.2.32 కోట్లు, రాయదుర్గంలోని మై హోం భూజా లడ్డూ రూ.51 లక్షలు, బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలు, మాదాపూర్‌లోని శ్రీనగర్ యూత్ లడ్డూ రూ.30 లక్షలు అత్యధిక ధరలు పలికాయి. భక్తులు పోటీపడి వేలంలో పాల్గొనడం విశేషం.