రంగారెడ్డి: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ న్యూ గాయత్రి నగర్లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నడుస్తున్న రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్ బాబు(65)ని క్రేన్ వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.