Locations: Hyderabad

  • క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిటైర్డ్ ఉద్యోగి మృతి

    రంగారెడ్డి: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ న్యూ గాయత్రి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నడుస్తున్న రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్ బాబు(65)ని క్రేన్ వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

     

  • TG నిరుద్యోగులకు అలర్ట్.. 118 పోస్టులకు నోటిఫికేషన్‌!

    తెలంగాణలో ఖాళీగా ఉన్న 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు LLB/BL డిగ్రీతో పాటు క్రిమినల్ కోర్టుల్లో మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు. 34 సంవత్సరాలకు మించకూడదు. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 5, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

  • చార్మినార్ వద్దకు బాలాపూర్ గణనాథుడు

    HYD: బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర పాతబస్తీలో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. లడ్డూ వేలం అనంతరం ప్రారంభమైన ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. డప్పు చప్పుళ్లు, యువత కేరింతల మధ్య సాగుతున్న ఊరేగింపు తాజాగా చారిత్రక చార్మినార్‌కు చేరుకుంది. యాత్ర హుస్సేన్ సాగర్ వైపుగా కొనసాగుతుండగా, సాయంత్రం 4 గంటల కల్లా నిమజ్జనం పూర్తి కావొచ్చని అంచనా. భద్రతా బలగాలు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాయి.(వీడియో)

  • కేవలం రూ. 7వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవిగో..

    భారతీయ బ్రాండ్ లావా తమ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ ‘లావా బోల్డ్ N1’ని విడుదల చేసింది. దీని ధర రూ. 6749 నుంచి మొదలవుతుంది. ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 5000 mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.75-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇది Unisoc T765 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి 13-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

  • సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు అస్వస్థత

    కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ అస్వస్థతకు గురయ్యారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని హైదరాబాద్‌ వస్తుండగా అనారోగ్యంపాలు కావడంతో, ఆయన్ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ నేపథ్యంలో స్థానిక సీబీఐ అధికారులతో ఆయన భేటీ కావాల్సి ఉంది. తాజా పరిణామంతో ఈ కీలక సమావేశంపై సందిగ్ధత నెలకొంది.

  • సైబర్ నేరగాళ్ల నయా మోసం..

    HYD: సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఒక వ్యక్తి ‘RTO చలాన్’ APK ఫైల్ డౌన్‌లోడ్ చేయగా.. ఖాతా నుంచి రూ.లక్షకుపైగా పోయాయి. మరొక వ్యక్తి ‘RTA చలాన్ 140.apk’ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోగా..రూ.5 లక్షలు పోయాయి. తెలియని నంబర్ నుంచి వచ్చే లింకులను, ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  • రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం: డీజీపీ జితేందర్

    TG: రాష్ట్రంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ నిమజ్జనం పూర్తి కాగా, బాలాపూర్ గణపతి శోభాయాత్రగా తరలివెళ్తున్నాడు. భద్రత కోసం ఇతర జిల్లాల నుంచి 8 వేల మంది బలగాలను మోహరించామని, ఏరియల్ సర్వే ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ, నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. బంజారాహిల్స్ ఐసీసీసీ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

  • తాండూరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

    వికారాబాద్: తాండూరులోని బాలాజీ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. మాజీ మండల విద్యాధికారి శేరి సుధాకర్ రెడ్డి, మృత్యుంజయ స్వామి, మాధురి, మోగులయ్య, పాండప్ప, సరితలను ఘనంగా సత్కరించారు. అలాగే ఉత్తమ విద్యార్థులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని వక్తలు కొనియాడారు.

  • కన్నుల పండుగగా నిమజ్జనం శోభయాత్ర

    వికారాబాద్: బషీరాబాద్ మండలం నవల్గి గ్రామంలోని మారుతి భజన మండలి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు భగవద్గీత, ఓంకారం, పూజ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 11 రోజుల పాటు వినాయకుడిని ప్రతిష్టించి, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి భజనలతో ఊరేగింపుగా వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ విశ్వనాథం, అనిల్, వివేక్, మారుతి భజన మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • 170 ట్రైనీ ఐపీఎస్ అధికారులకు సీ.వి. ఆనంద్ క్లాస్

    హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ సీ.వి. ఆనంద్  తన 10 సంవత్సరాల హైదరాబాద్ అనుభవాలను పంచుకున్నారు. 25,000 విగ్రహాల నిమజ్జనం చివరి రోజున ఉంటుందని అంచనా వేశాారు. గణేష్ ఉత్సవాల బందోబస్తు నిర్వహణలో పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలను వివరించారు.  రామ్ నివాస్ సేపట్, కల్మేశ్వర్ సింగేన్వార్ తదితరులు పాల్గొన్నారు.