HYD: ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడిని నిమజ్జనం చేయడానికి వేలాదిగా ప్రజలు హుస్సేన్సాగర్కు తరలివచ్చారు. ‘వచ్చే ఏడాది మళ్ళీ వస్తా’ అని చెప్పినట్లు ఆయన చివరి చూపు అందరి హృదయాలను బరువెక్కించింది. ఇదే సమయంలో ట్యాంక్బండ్ పరిసరాలు గణపతి బప్పా మోరియా! మళ్లీ రావయ్యా! అనే నినాదాలతో మారుమోగింది.