HYD: బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రాచకొండ కమిషనరేట్ పరిధిని దాటి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (హెచ్పీసీ) పరిధిలోకి ప్రవేశించింది. బాలాపూర్ గణనాథుడికి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తన బృందంతో కలిసి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ శోభాయాత్ర పాతబస్తీ మీదుగా ట్యాంక్బండ్కు కదులుతోంది. భక్తులు డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఉత్సవాల్లో పాల్గొంటూ గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు.