హైదరాబాద్లో వాతావరణ మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు పెరిగాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నారాయణగూడలోని ఒక డయాగ్నోస్టిక్ కేంద్రంలో రోజుకు 15-20 డెంగీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, కాచిచల్లార్చిన నీటిని తాగడం, వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.