దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ దశదినకర్మ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కనకరత్నమ్మ చిత్రపటంపై పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన అల్లు కుటుంబసభ్యులను పరామర్శించి, అల్లు అర్జున్తో మాట్లాడారు.