TG: హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ పైలాన్ను ఆవిష్కరించారు. తన తల్లి బసవతారకం కోరిక మేరకు ఈ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు. క్యాన్సర్ పేషెంట్స్కు అండగా ఉండడం కోసం ఎంతో మంది దాతలు ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు.