మేడ్చల్: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు జేఏసీ వెంకన్న, మురుగేష్, ఉపేందర్, నర్సింగ్, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.