మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామనీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజుల రామారం డివిజన్ ఒక్షిత హిల్ వ్యూ కాలనీలో రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు వివేకానంద శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు.