HYD: నార్సింగి మార్వా టౌన్షిప్లో రూ.6కోట్ల విలువైన 617 చ.గజాల ప్లాటు మార్టిగేజ్ విడుదల కోసం నకిలీ పత్రాలు సృష్టించిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణమోహన్రెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీరజ దవులూరి అనే వ్యక్తి సీహెచ్ శివనాగేశ్వరరావు పేరిట నకిలీ ఫైల్తో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు సమర్పించాడు. సబ్రిజిస్ట్రార్ అనుమానంతో కమిషనర్ను సంప్రదించగా.. ఆ పత్రాలు నకిలీవని తేలింది.