మేడ్చల్: నాగోల్ డివిజన్లోని శ్రీ సాయి నగర్ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన కాలనీ అసోసియేషన్ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీ సభ్యులు డ్రైనేజ్ ఓవర్ఫ్లో, రాత్రిపూట గంజాయి సేవనం వల్ల భయాందోళన, లక్కీ రెస్టారెంట్ వద్ద అక్రమ పార్కింగ్, నీటి కొరత, విద్యుత్ స్తంభాల దెబ్బతినడం వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
