HYD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవానికి జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులు, సెంట్రల్ మీడియన్స్, ఖాళీస్థలాలు, కాలనీ పార్కుల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అత్యధికంగా కూకట్పల్లి జోన్ పరిధిలో 6.25లక్షలు, శేరిలింగంపల్లిలో 6లక్షలు, ఎల్బీనగర్ 4.53 లక్షలు, చార్మినార్లో 3.24 లక్షలు, సికింద్రాబాద్ 3లక్షలు, ఖైరతాబాద్లో 2.5లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన మొక్కలను జీహెచ్ఎంసీ నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి.