మేడ్చల్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలకు ఏర్పాటుచేసిన వేలం పాటలో భారీ స్పందన లభించింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 7వ ఫేజ్లోని 18 ప్లాట్లను వేలం వేయగా అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. 7వ ఫేజ్లోని ప్లాట్ నంబర్ 22ను అత్యధికంగా గజానికి రూ.2.98లక్షల చొప్పున దక్కించుకున్నారు. మొత్తం 18 ప్లాట్లలోని 6,236.33 గజాలకు కలిపి 141 కోట్ల 36 లక్షల 89 వేల 100 రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.