రంగారెడ్డి: చేవెళ్లలోని త్రిపురా రిసార్ట్లో ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈపార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని భారీగా విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 48మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా..అందులో 9మంది గంజాయి తీసుకున్నట్లు తేలింది. మంగ్లీతో పాటు రిసార్ట్ నిర్వాహకులపై కేసు నమోదైంది.