HYD: రానున్న దసరా, దీపావళి, ఛట్ పండగల దృష్ట్యా ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫాం 10 వైపు 200 కార్ల పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అదనపు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నామని, టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
Locations: Hyderabad
-
నిమజ్జనానికి ఎన్ని ప్రత్యేక బస్సులంటే
HYD : నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్బండ్కు చేరుకొనేందుకు 600 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు RTC అధికారులు తెలిపారు. ఆ యా రూట్లకు అనుగుణంగా వివిధ ప్రాంతాల నుంచి బస్సుల రాకపోకలను క్రమబద్దీకరించినట్లు వివరించారు. ప్రయాణికులు, భక్తులు ఇతర సమాచారం కోసం 99592 26160, 99592 26154 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
-
LIVE VIDEO: ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
HYD: ఖైరతాబాద్ గణేశుడు శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. లక్షలాది భక్తుల మధ్య గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు. ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా వారి భక్తిని చాటుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మార్గ్లో నాలుగో నంబరు స్టాండులో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అక్కడ బాహుబలి క్రేన్ను ఏర్పాటు చేశారు.
-
సిటీ పోలీసులోకి ‘లాడెన్ జాగిలాలు’
HYD: అమెరికన్ నేవీ సీల్స్ 2011లో వినియోగించిన బెల్జియం మలినాయిస్ జాతి జాగిలాలు నగర పోలీసు విభాగంలో అందుబాటులోకి రానున్నాయి. సిటీ పోలీసులు కొత్తగా ఖరీదు చేసిన 12 జాగిలాల పిల్లల్లో ఆరు బెల్జియం మలినాయిస్ జాతివే ఉన్నాయి. దేశంలోనే ఈ తరహా జాగిలాలను నేరుగా ఎంపిక చేసి, అందుబాటులోకి తీసుకువస్తున్న తొలి పోలీసు విభాగంగా హైదరాబాద్ కమిషనరేట్ కావడం గమనార్హం.
-
వినాయకుడి నిమజ్జనం.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
HYD: వినాయక నిమజ్జనం సమయంలో భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గణపతి విగ్రహాలను నేరుగా నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయరాదు. విగ్రహం పగలకుండా జాగ్రత్త వహించాలి. నిమజ్జనానికి ముందు విగ్రహానికి పూజ చేసి, మోదకాలు, లడ్డూలు, పువ్వులు సమర్పించి, ప్రసాదాన్ని భక్తులకు పంచాలి. విగ్రహాన్ని నేరుగా నీటిలో పడవేయకుండా, మూడుసార్లు ముంచి నెమ్మదిగా విడిచిపెట్టాలి. ముఖ్యంగా మత్తు పదార్థాలు సేవించి నిమజ్జనం చేయరాదు.
-
హైదరాబాద్లో అంగరంగ వైభవంగా గణేశ్ నిమజ్జనం!
భారీ భద్రత మధ్య హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం జరుగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున నుంచే విగ్రహాల నిమజ్జనం ఊపందుకుంది. వాహనాలు, ప్రజల రద్దీ మధ్య ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోతోంది. మరోవైపు గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లను నడిపనున్నట్టు ప్రకటించింది.
-
HYDలో డేటింగ్ స్కామ్
హైదరాబాద్లో కొత్త తరహా డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లు వినియోగించే పురుషులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. యాప్లలో నకిలీ ప్రొఫైళ్లు సృష్టిస్తున్న యువతులు.. వలపు వల విసురుతూ దగ్గరవుతున్నారు. పరిచయం పెంచుకుని ఫలానా పబ్బులో కలుద్దామంటూ రప్పించి ఖరీదైన మద్యం, ఆహారం పేరుతో రూ.వేలల్లో బిల్లులు కట్టించి పత్తా లేకుండా పోతున్నారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
-
కాసేపట్లో ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ప్రారంభం
HYD: మరికాసేపట్లో ఖైరతాబాద్లో కొలువైన మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. లక్షలాది భక్తుల మధ్య గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాడు. ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా వారి భక్తిని చాటుకుంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
-
ఇరానీ చాయ్.. తాగరా భాయ్
HYD: నగరానికి.. ఇరానీ చాయ్కు చారిత్రక బంధముంది. 19వ శతాబ్దంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో పాతబస్తీలో ఇరానీ కెఫేల సంస్కృతి మొదలైంది. చిక్కదనం.. గోధుమ వర్ణం.. తీయదనం.. ప్రత్యేక రుచి కలగలిసిన ఈ తేనీటిని సేవించనిదే చాలా మందికి తెల్లవారదు. ఉస్మానియా బిస్కెట్ తింటూ ఇరానీ చాయ్ తాగితే..ఆ రుచే అమోఘం. 1993లో 60పైసలు ఉన్న ఇరానీ చాయ్..ప్రస్తుతం పాతిక రూపాయలకు చేరింది.
-
HYDలో 48 గంటలు వాటర్ బంద్
హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు గోదావరి తాగునీటి సరఫరాలో 48 గంటల పాటు అంతరాయం కలగనుంది. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ కారణంగా SRనగర్, సనత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, KPHB, జగద్గిరిగుట్ట, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.