HYD: : బదిలీపై కర్నాటక హైకోర్టుకు వెళ్తున్న తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ పి.శ్రీసుధకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ అధ్యక్షతనలో ఆమెకు వీడ్కోలు పలికింది. జస్టిస్ పి.శ్రీసుధ 5,055 కేసులను పరిష్కరించారని జస్టిస్ సుజయ్పాల్ చెప్పారు. జస్టిస్ శ్రీసుధ మాట్లాడుతూ.. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు సహా పలు ప్రధాన కేసుల తీర్పుల విచారణ, తీర్పులో భాగస్వామి కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.