HYD: ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మొదట ఈ నెల 10 నుంచి ప్రతిరోజూ ఇద్దరేసి కార్పొరేషన్ల ఛైర్మన్లు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గాంధీభవన్లో సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. వాటిని సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి చొరవ తీసుకుంటారు.
Locations: Hyderabad
-
‘బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలి’
HYD: వారాసిగూడలోని చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కార్పొరేటర్ సామల హేమ, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారమివ్వకుండా బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మతపెద్దలు, పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, తదితరులు పాల్గొన్నారు.
-
RCB విజయం.. కోహ్లీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చూడండి!
IPL-2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో RCB విజయం సాధించింది. IPL చరిత్రలో తొలిసారి కప్పు కొట్టింది. దీంతో RCB, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న రాత్రి RCB గెలిచిన అనంతరం ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలోని షాద్నగర్లో కోహ్లీ ఫ్యాన్స్ టపాసులు పేలుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.
-
సంస్థాగతంగా కాంగ్రెస్ బలోపేతంపై మీనాక్షి దృష్టి
HYD: సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని పార్టీ కమిటీల ఏర్పాటు కోసం గతంలో జిల్లాకు ఇద్దరు చొప్పున నియమించిన పరిశీలకులతో బుధవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మేరకు జిల్లాల పరిశీలకులకు గాంధీభవన్ నుంచి సమాచారం వెళ్లింది.
-
పోలీస్ స్టేషన్ను సందర్శించిన సీపీ
HYD: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరమత్తులు నిర్వహించి హైదరాబాద్ పోలీసులకు తిరిగి అప్పగించిన సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్లోని చారిత్రక భవనం రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సందర్శించారు. సీపీ మాట్లాడుతూ..1900నుంచి 2016వరకు 116ఏళ్ల పాటు రక్షకబట నిలయంగా సేవలందించిందని, 2016లోనే మరమత్తుల నిమిత్తం అద్దె భవనంలోకి పోలీస్స్టేషన్ను తరలించడం జరిగిందన్నారు.
-
ప్రతిభ చాటి.. ఐదు స్వర్ణాలు సాధించి
HYD: JNTU 13వ స్నాతకోత్సవం వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ECE విద్యార్థిని పాలడుగు నవ్యశ్రీ ఐదు పతకాలు అందుకున్నారు. ECE విభాగంలో ఉత్తమ ప్రతిభకు ఒకటి, డీవీపీ నరసరాజు స్మారక ఎండోమెంట్ పతకంతోపాటు, వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఉత్తమ విద్యార్థిని విభాగంలో ప్రతిభ కనబరిచినందుకు వేదవతి బంగారు పతకం, మరికొన్ని పతకాలు సాధించారు.
-
మూడు మార్గాలు సుగమమయ్యేనా?
TG: మెట్రోరైలు రెండోదశ ‘బి’ భాగం డీపీఆర్లను ఈనెల 5న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. మూడు మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)లను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్(హెచ్ఏఎంఎల్) రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్ట్గా చేపట్టనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదమే తరువాయి డీపీఆర్లు కేంద్రానికి చేరనున్నాయి.
-
సైకిల్ ట్రాక్లపై జీహెచ్ఎంసీ నిర్వహణ లోపం
HYD: నగరంలో సైకిల్ ట్రాక్లు ఎక్కువగా లేకపోవడంతో జీహెచ్ఎంసీ ప్రధాన రహదారులకు ఇరువైపులా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సైక్లిస్ట్ల సౌకర్యార్థం ప్రత్యేక మార్కింగ్లతో చేశారు. నెక్లెస్ రోడ్డు చుట్టూ కూడా ట్రాక్ మార్కింగ్లు చేశారు. జీహెచ్ఎంసీ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆయా ట్రాక్లు పార్కింగ్ కేంద్రాలుగా, తోపుడు బండ్లకు అడ్డాగా మారాయి.
-
హైదరాబాద్లో రూ.లక్ష దాటిన బంగారం ధరలు
HYD: నగరంలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,110కి చేరింది. ఇదే ఆల్ టైమ్ గరిష్ట స్థాయి. ఏప్రిల్ 22న ఇది రూ.1,00,015గా ఉండగా, గణనీయమైన పెరుగుదల నమోదైందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్, దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం పట్ల ఆకర్షణ డిమాండ్ను పెంచుతోంది.
-
మరో 2-3 రోజుల్లో ట్రాఫిక్ క్లియర్
HYD: మలక్పేట్ అక్బర్ ప్లాజా వద్ద డ్రైనేజీ లీకేజీ కారణంగా మూడు రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం నుంచి మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తి చేయడానికి మరో 2-3 రోజులు పట్టవచ్చని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తెలిపారు. ప్రధాన సమస్య పరిష్కారమైన వెంటనే ఈమార్గంలో కొత్త రోడ్డు వేయనున్నట్లు చెప్పారు. రద్దీ దృష్ట్యా ప్రస్తుతం వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు.