HYD: బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సహకారంతో బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గం, మోండా డివిజన్, టీచర్ కాలనీ, అంబేద్కర్ నగర్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకురాలు సీ వైష్ణవి యాదవ్ తెలిపారు. వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.