HYD: గణేష్ నిమజ్జనం కారణంగా జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని ఫార్మా డి మొదటి ఏడాది పరీక్షలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 6న జరగాల్సిన ఈ పరీక్షలు సెప్టెంబర్ 17కు మార్చబడ్డాయి. ఈ విషయాన్ని జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.కృష్ణమోహన్ రావు ప్రకటించారు. పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చని విద్యార్థులకు తెలిపారు.