HYD: నగరంలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,110కి చేరింది. ఇదే ఆల్ టైమ్ గరిష్ట స్థాయి. ఏప్రిల్ 22న ఇది రూ.1,00,015గా ఉండగా, గణనీయమైన పెరుగుదల నమోదైందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్, దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం పట్ల ఆకర్షణ డిమాండ్ను పెంచుతోంది.
Locations: Hyderabad
-
మరో 2-3 రోజుల్లో ట్రాఫిక్ క్లియర్
HYD: మలక్పేట్ అక్బర్ ప్లాజా వద్ద డ్రైనేజీ లీకేజీ కారణంగా మూడు రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం నుంచి మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తి చేయడానికి మరో 2-3 రోజులు పట్టవచ్చని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తెలిపారు. ప్రధాన సమస్య పరిష్కారమైన వెంటనే ఈమార్గంలో కొత్త రోడ్డు వేయనున్నట్లు చెప్పారు. రద్దీ దృష్ట్యా ప్రస్తుతం వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు.
-
కూకట్పల్లిలో అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్
మేడ్చల్: కూకట్పల్లి పీఎస్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఆంధ్రప్రదేశ్లోని అద్దంకికి చెందిన 5మంది అంతరాష్ట్ర డ్రగ్స్ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 800గ్రాముల డ్రగ్స్, 5మొబైల్ ఫోన్లు, రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు వారి వద్ద దొరికిన డ్రగ్స్ మార్కెట్ విలువ సుమారు 2కోట్ల రూపాయలు. పరారీలో ఉన్న ఆరో వ్యక్తి తిరుపతికి చెందిన కానిస్టేబుల్గా గుర్తించారు.
-
ORRపై ప్రమాదం జరిగితే.. వెంటనే కాల్ చేయండి
HYD: ORRపై ప్రమాదానికి గురైన వెంటనే ట్రామా సెంటర్లలో ఎమర్జెన్సీ వైద్యం అందించడం ద్వారా అనేక మందికి ప్రాణాలు నిలబడుతున్నాయి. 158 కిలోమీటర్ల పొడవు కలిగిన ORRపై ప్రమాదం జరిగితే వెంటనే 1066, 14449, 100కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. కాల్ చేసిన వెంటనే స్పందించి, గోల్డెన్ హవర్లో వైద్యం అందించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
-
కవిత ఇంటి ముందు ఫ్లెక్సీలో ఇంట్రెస్టింగ్ కొటేషన్
కొన్నిరోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ నేతలే టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు కవిత వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనికి తాజాగా హైదరాబాద్లోని కవిత ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’’ అనే కొటేషన్ అందరి దృష్టికి ఆకర్షిస్తోంది.
-
ప్రిజమ్ పబ్లో హీరోయిన్పై దాడి
HYD: ప్రిజమ్ క్లబ్ సిబ్బంది సినీ నటి కల్పికపై దాడి చేశారు. బర్త్ డే కేక్ విషయంలో కల్పికకు, సిబ్బందికి వాగ్వాదం మొదలైంది. దీంతో పబ్ సిబ్బంది కల్పికపై బూతులతో రెచ్చిపోయారు.కల్పిక ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆమె పై దాడికి దిగినట్లు తెలుస్తోంది.మరీ పబ్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై కల్పిక పోలీసులకు ఫిర్యాదు చేసిందా లేదా అన్న దానిపై సమాచారం లేదు.
-
మలక్పేట్ రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
HYD: మలక్పేట్ రైల్వే బ్రిడ్జి నుంచి మూసారాంబాగ్ వెళ్లే మార్గంలో రహదారిపై మురుగు నీరు పారుతోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనిపై స్పందించిన యంత్రాంగం శనివారం ఉదయం డ్రైనేజీ పనులను చేపట్టింది. ఈక్రమంలో రోడ్డుపై మరోసారి భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
-
పైప్లైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్
మేడ్చల్: చర్లపల్లి డివిజన్ సోనియా గాంధీ నగర్ ఫేజ్2 నాగార్జున నగర్ రోడ్ నెం.6 నుంచి తుఫాను నీటి కాలువ RCC పైప్లైన్ పనులను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దాసరి కనకయ్య ముదిరాజ్ కాలనీ అధ్యక్షుడు నరేష్, వైస్ ప్రెసిడెంట్, తదితరులు పాల్గొన్నారు.
-
బయో గ్యాస్ మూసివేతపై నిరసన
HYD: బోయిన్పల్లిలోని బీఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డ్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూరగాయల వ్యర్థాలతో బయో గ్యాస్ తయారు చేసేందుకు గ్యాస్ ప్లాంట్ను ఏర్పాలు చేసింది. ఈ ప్లాంట్ను గతంలో ప్రధాని మోదీ సైతం అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిర్వీరం చేసే ప్రయత్నంలో భాగంగా మూసివేసిందంటూ బీఆర్ఎస్ నిరసన తెలిపారు. వెంటనే ప్లాంట్ను తెరవాలని వారు ఛైర్మన్ను కోరారు.
-
హైదరాబాద్కు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
TG: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన అందాల భామలు నగరానికి చేరుకున్నారు. ‘మిస్ వరల్డ్- 2024’ విజేతగా నిలిచిన క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్) శుక్రవారం వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న క్రిస్టినాకు తెలంగాణ అధికారులు ఘనస్వాగతం పలికారు.