HYD: పార్సిగుట్ట చౌరస్తా మందుబాబులకు అడ్డాగా మారింది. రెండు మద్యం దుకాణాలు, రెండుబార్లు ఉండడంతో ఈ ప్రాంతంతో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. వాటిని అక్కడి నుంచి తొలగించాలని స్థానికులు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. గొడవపెట్టుకోవడం, భయాందోళనకు గురిచేయడం వంటివి చేస్తుండటంతో మందుబాబులతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మద్యం షాపు యజమానులకు నోటీసులు ఇచ్చామని అడిషనల్ డీసీపీ నర్సయ్య తెలిపారు.
Locations: Hyderabad
-
మందుబాబులతో స్థానికులు ఇబ్బందులు
-
ఎమ్మెల్యేను కలిసిన నూతన కమిటీ సభ్యులు
హైదరాబాద్: ఇటీవల నూతనంగా ఎన్నికైన సనత్నగర్లోని సుందర్ నగర్ కాలనీ అసోసియేషన్ కమిటీ సభ్యులు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలోని సమస్యలను తన వద్దకు తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామని తలసాని హామీ ఇచ్చారు.
-
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
HYD: తుకారాం గేట్ జేఎల్పీఎస్ నగర్లోని నల్లపోచమ్మ, శ్రీ మహంకాళి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని ఆకాంక్షించారు.