HYD: సితాఫలమండీ కూడలిలో బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ల కొత్త విగ్రహాలను తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. కార్పొరేటర్లు, అధికారులతో కలిసి విగ్రహాల ఏర్పాటు ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, పరిసరాల సుందరీకరణతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.