హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. నగర నలుమూలల నుంచి గణనాథులు ట్యాంక్బండ్కు భారీగా తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.