మేడ్చల్ పట్టణం కిందిబస్తీలో ఉట్టికొట్టే కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఉట్టి కొట్టేందుకు ఇనుప వైరును విద్యుత్ స్తంభాలకు కట్టగా.. అది తెగిపోయింది. ఆ వైరును ఎస్బీఐ బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి నరేశ్ (30) పట్టుకున్నాడు. చెప్పులు లేకపోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.