Locations: Krishna

  • బాణాసంచా కాల్చుతూ పవన్ జన్మదిన సంబరాలు

    ఎన్టీఆర్: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ 54వ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కంచికచర్ల మండల అధ్యక్షుడు నాయిని సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కంచికచర్ల పట్టణంలో రంగబొమ్మ వద్ద బాణాసంచా కాల్చుతూ కేక్ కట్ చేసి పవన్‌కల్మాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండారుపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

  • బెల్ట్ షాపు తొలగింపు కోసం మహిళల ఆందోళన

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలంలోని షేర్‌మహమ్మద్ పేట గ్రామంలో అక్రమ బెల్ట్ షాపు తొలగించాలని కోరుతూ మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిరసన చేపట్టారు. మహిళా సంఘం జిల్లా నాయకురాలు సోమోజు నాగమణి మాట్లాడుతూ.. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలుస్తున్నాయని ఆరోపించారు. బడి, గుడి, సచివాలయం, బ్యాంకు సమీపంలో షాపులు ఉండటం దారుణమని పేర్కొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
  • కొల్లికొల్లలో వైయస్సార్ విగ్రహావిష్కరణ

    ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు మండలం కొల్లికొల్ల గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ జరిగింది. భారీ జన సందోహం నడుమ వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదల ఆశాదీపం, ఆత్మీయ పిలుపు ‘నమస్తే’తో గుర్తుండిపోయిన రాజన్నను స్మరించుకున్నారు.
  • ముంజులూరులో పవన్‌ కల్యాణ్ జన్మదిన వేడుకలు

    కృష్ణా: పెడన నియోజకవర్గంలోని ముంజులూరు గ్రామంలో జనసేన నాయకులు కూనపరెడ్డి రాజశేఖర్, రామ్‌నాధ్, సతీష్ బేతు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా జనసేన సెంట్రల్ రాష్ట్ర కో-కన్వీనర్ వికృతి శ్రీనివాస్, బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు, డీసీ ఛైర్మన్ బొర్రా కాశీ, జనసేన మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ హాజరయ్యారు.
  • పురిటిగడ్డ సొసైటీ ఛైర్ పర్సన్‌గా హరినాథ్

    కృష్ణా: చల్లపల్లి మండలం పురిటిగడ్డ సొసైటీ ఛైర్ పర్సన్‌గా పెద్దిబోయిన హరినాథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ హరినాథ్, పర్సన్ యార్లగడ్డ రమేష్ బాబులకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఈవో కంఠంనేని నాగేశ్వరరావు, నేతలు పరుచూరి సురేష్, కైతేపల్లి శ్రీనివాసరావు, మాతంగి వేణు, రాజులపాటి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

     

  • నిబంధనలకు లోబడి ఈ-టెండర్లు పిలవాలి: కలెక్టర్

    కృష్ణా: జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్ నుంచి కొత్తగా ఇసుక తవ్వకాలకు నిబంధనలకు లోబడి ఈ-టెండర్లు పిలవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో ఇసుక నిల్వల స్థితిగతులపై ఈ సమావేశంలో సమీక్షించారు.

  • బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ రమేష్‌‌కు ఘన సన్మానం

    ఎన్టీఆర్: బీజేపీ నందిగామ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన మాదాల రమేష్‌ని నియోజకవర్గ నాయకులు, కాకాని నగర్ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈనెల 5వ తేదీన ఆయన జరగబోయే సారధ్యం రాష్ట్ర అధ్యక్షులు పర్యటనలో భాగంగా నందిగామ సందర్శించిన వారిని సందర్భంగా ముఖ్య నాయకుల సమావేశంలో వారు పలు సూచనలు చేశారు.

  • కంచికచర్ల మండలంలో చెరువుల కళకళ..!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కంచికచర్ల, పరిటాల ప్రాంతంలో సాగునీటి చెరువులు జల కలను సంతరించుకుంటున్నాయి. గత నాలుగు రోజులు కురిసిన వర్షాలతో వాగులు పొంగి ప్రవహించి జల కలను సంతరించుకుంటున్నాయి. నీటితో కలకలాడుతున్న చెరువులను చూసి ఆయకట్టు పరిధిలోని రైతులు మోములో ఆనందం వెల్లివిరిసింది.

  • ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు

    ఎన్టీఆర్: కొండపల్లి 9వ డివిజన్ యాదవుల బజార్ బావి సెంటర్‌లో మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మాజీ మండల ప్రధాన కార్యదర్శి సాకిరి వెంకట నరసయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ  పురపాలక సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రసాద్, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘రాజకీయ, సినీ రంగాల్లో పవన్‌కళ్యాణ్ ఉన్నత స్థానంలోకి రావాలి’

    ఎన్టీఆర్: చండ్రగూడెం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీలక్ష్మీనారాయణస్వామి, దాసాంజనేయస్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. జనసైనికులు, వీర మహిళలు పవన్‌కళ్యాణ్ ఆయురారోగ్యాలు, రాజకీయ, సినీ రంగాల్లో మరింత ఉన్నత స్థానంలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో మైలవరం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ, జనసేన మైలవరం మండల అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.