కృష్ణా: మైలవరం మండలం తోలుకోడు ఊటవాగుపై ఉన్న ఆర్అండ్బీ రహదారి ప్రమాదకరంగా మారింది. వరుస ప్రమాదాలతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం రాత్రి ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి రోడ్డు సైడ్ దిగబడింది. ఇదే వారంలో ఒక ట్రాక్టర్, స్కూల్ విద్యార్థుల వ్యాన్, ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ పరిస్థితులు జరగక ముందలే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.