Locations: Krishna

  • గ‌ణ‌ప‌తికి కేశినేని వెంక‌ట్ ప్ర‌త్యేక పూజ‌లు

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు వెంకట్‌ను ఘనంగా సత్కరించారు. 43వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసినందుకు, వినాయకుడిని రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించిన నిర్వాహకులను అభినందించారు.

     

  • ‘యూరియా సరఫరాలో అవకతవకలు జరగకూడదు’

    కృష్ణా: గూడూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని కలెక్టర్ డీకే బాలాజీ అకస్మాకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో సమావేశమై యూరియా సరఫరా విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. యూరియా పంపిణీలో ఎలాంటి అవతావకాలు జరగకూడదని ఏ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు.

  • ఘనంగా ట్రాక్టర్‌లతో రైతన్నల ర్యాలీ

    కృష్ణా: కోనేరు నుంచి జిల్లా పరిషత్ వరకు జరిగిన శోభాయాత్రలో ట్రాక్టర్‌లతో రైతన్నల ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్ హాజరయ్యారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో గణనాథుని అలంకరణ

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో వాసవి మార్కెట్ ఆధ్వర్యంలో జరుగుతున్న 43వ వార్షిక గణపతి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల ప్రధాన ఆకర్షణగా గణనాథుడిని రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం జరిగింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, స్థానిక నేతలతో కలిసి గణనాథుని దర్శించుకున్నారు. ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

     

     

  • 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

    ఎన్టీఆర్: సెప్టెంబరు 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడలోని జమ్మిదొడ్డి వద్ద దసరా కో ఆర్డినేషన్ సమావేశంతో ఆనంతోపాటు సీపీ రాజశేఖర్ బాబు, ఈవో శీనానాయక్, దుర్గగుడి అధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ..11రోజులు 11అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిస్తామని తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

     

  • జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదు: కలెక్టర్

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం గౌరవరం సొసైటీలో రైతులకు యూరియా సరఫరా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రస్తుతం 3000 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందన్నారు. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

     

  • ‘ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శం’

    ఎన్టీఆర్: కంచికచర్ల ఓసి క్లబ్‌లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా పాల్గొని, ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల స్థానం గౌరవనీయం అని ఆమె అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గౌరవిస్తామని, అందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

     

  • అమ్రిత సాయి కాలేజీలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం

    ఎన్టీఆర్: పరిటాల అమ్రిత సాయి ఇంజనీరింగ్ కాలేజీలో వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ శశిధర్ తెలిపారు. సెక్రటరీ రామ మోహన రావు, సీఈఓ సాయి మనోజ్ పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయక చవితిని ఆనవాయితీగా జరుపుకుంటామని, విద్యార్థులకు విజయం కలగాలని ఆకాంక్షించారు. B.Tech CIC విభాగం లడ్డూ వేలంపాటలో కైవసం చేసుకోగా, విద్యార్థులు, అధ్యాపకులు భక్తితో ఊరేగింపులో పాల్గొన్నారు.

  • ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు కార్యచరణ ఇదే..!

    ఎన్టీఆర్: సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 8న జిల్లా కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందిస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలతోపాటు ప్రచార జాతాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చి, అసెంబ్లీ సమావేశాల్లో భారీ నిరసన చేపడతారు. స్త్రీశక్తి పథకం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహనమిత్ర కింద రూ.30వేలు ఇవ్వాలని, లేనిపక్షంలో బంద్‌కు వెళతామని హెచ్చరించారు.

  • ‘గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ’

    కృష్ణా: గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర పరిశోధన సులభతరమవుతుందని చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు తెలిపారు. గురువారం మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామాన్ని ఎస్ఐ సత్యనారాయణతో సీఐ సందర్శించారు. సొసైటీ, పంచాయతీ, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో మొత్తం 22సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీలతో ప్రారంభిస్తామని సొసైటీ ఛైర్మన్ సుబ్బారావు తెలిపారు.