ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు వెంకట్ను ఘనంగా సత్కరించారు. 43వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసినందుకు, వినాయకుడిని రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించిన నిర్వాహకులను అభినందించారు.