కృష్ణా: మొవ్వ మండలం కోసూరులో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి నాలుగు దేవాలయాల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. రామాలయం, వేణుగోపాల స్వామి దేవాలయాల్లో సుమారు రూ.5లక్షలు విలువచేసే నాలుగు కేజీల వెండి కిరీటాలు, చటారాలు, పలు ఆభరణాలు అపహరించారు. గంగానమ్మ, శ్రీవినాయక దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనపై కూచిపూడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.