కృష్ణా: వరద పరిస్థితి అంచనాకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. బుధవారం నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద కృష్ణానది వరద పరిస్థితిని ఆయన పరిశీలించారు. అక్కడే అధికారులతో సమావేశమై వరద పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ బాలవర్దిరావు, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు స్వర్ణలత, డీసీ ఛైర్మన్ బండ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
వంగ పంటలో ఇలా అధిక దిగుబడులు!
కృష్ణా: ఘంటశాల మండలం కొడాలి గ్రామంలోని బంతి, వంగ పంటలను కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డా.మంజువాణి, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త కృష్ణవేణి బుధవారం పరిశీలించారు. పూత, కాపు దశలో ఉన్న వంగలో కాండం తొలుచు, రసం పీల్చే పురుగులను గమనించి రైతులకు నివారణ చర్యలను వివరించారు. 40వ రోజున ప్రధానకాండం చివరలను తుంచాలని సూచించారు. దీనివలన అధిక దిగుబడి పొందవచ్చన్నారు. -
దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేత రాజీవ్: బొర్రా
ఎన్టీఆర్: భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా తీర్చిదిద్దిన మహానేత రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్ తెలిపారు. దేశ సమగ్రతను కాపాడే క్రమంలో ఆయన ప్రాణాలు అర్పించారని కొనియాడారు. కొండపల్లి బి.కాలనీ సెంటర్లో రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ విగ్రహానికి కిరణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
-
వామ్మో.. ఒక్కసారిగా టమాటా ధరలకు రెక్కలు.. కిలో ఎంతంటే?
మొన్నటి వరకు కిలో టమాటా ధర రూ.20-30ఉండగా..తాజాగా హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.60-70 పలుకుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో డిమాండ్కు తగ్గ టమాటా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా వ్యాపారులు అంటున్నారు. విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో కేజీ టమాటా ధర రూ.50-60 వరకు పలుకుతుంది. ఇక, మిగతా జిల్లాల్లో 35-45 వరకు పలుకుతుంది.
-
దోమలను ఇలా నియంత్రించండి!
ఎన్టీఆర్: ఇళ్ల పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కంచికచర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి మధురిమ తెలిపారు. తద్వారా దోమలను నియంత్రించి విష జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య కేంద్రంలో దోమల వ్యాప్తి వలన కలిగే వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మలేరియా నివారణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
-
రైతన్న శ్రేయస్సే లక్ష్యం: తంగిరాల
ఎన్టీఆర్: రైతన్న శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. నందిగామలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన ఎరువుల విక్రయ కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. నాణ్యమైన ఎరువులు, సాంకేతిక సహాయం, శిక్షణ ద్వారా రైతుల ఉత్పాదకత పెంచడమే లక్ష్యమని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతుల ఆర్థిక స్థితిని కూటమి ప్రభుత్వం మెరుగు పరుస్తుందని స్థానికులు ప్రశంసించారు. -
పీ-4లో ప్రజల భాగస్వామ్యం
ఎన్టీఆర్: పీ-4 కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల మండలంలో బుధవారం పి-4 స్వర్ణ సంకల్పం ప్రోగ్రాన్ని నిర్వహించారు. ఈ మేరకు పట్టణానికి చెందిన పెద్దమళ్ళ రంగమ్మ, మనుబోలు దుర్గా, గొట్టం లక్ష్మమ్మలను కంచికచర్ల గ్రామానికి చెందిన బాలాజీ మెడికల్ షాపు యజమాని బుడ్డి సూర్య ప్రకాష్ దత్తత తీసుకున్నారు. వారికి అవసరమైన సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
ప్రకాశం బ్యారేజీలో కృష్ణమ్మ పరవళ్లు
ఎన్టీఆర్: ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 4.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 70 గేట్లలో 69 గేట్ల ద్వారా 4.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
-
నేరాలపై సమీక్షా సమావేశం
ఎన్టీఆర్: మైలవరం ఏసీపి వై.ప్రసాదరావు ఆధ్వర్యంలో తిరువూరు డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో బుధవారం నేరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పాత కేసులు, పెండింగ్ అరెస్టులు, ట్రాఫిక్ సమస్యలు, రౌడీ షీటర్లపై నిఘా వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
-
విశాఖలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ ప్రారంభం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా విశాఖలోని డెక్ భవనంలో ఏర్పాటు చేసిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, వెస్ట్ ఎమ్మెల్యే గణ బాబు, జిల్లా కలక్టర్ హరెంధిర ప్రసాద్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.