కృష్ణా: పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడలోని ప్రజా వేదిక కార్యాలయంలో లబ్దిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 37 మందికి రూ.20,42,048 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు అందజేశారు.