ఎన్టీఆర్: మైలవరం మండలం పుల్లూరు పీఏసీఎస్ త్రిసభ్య ఛైర్మన్గా వజ్రాల సురేష్ రెడ్డి, కమిటీ సభ్యులు యు.వెంకట నారాయణ, వైవీ శ్రీనివాసరావులు సొసైటీలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొని త్రిసభ్య కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రైతుల శ్రేయస్సు ప్రధాన ధ్యేయంగా త్రిసభ్య కమిటీ సభ్యులు సేవలందించాలని ఎమ్మెల్యే సూచించారు.