కృష్ణా: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ యూరియాను కేవలం సాధారణ రైతులకు చేరాలని కలెక్టర్ డీకే బాలజీ స్పష్టం చేశారు. ఫౌల్ట్రీ, ఆక్వా పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరరాలకు యూరియాను వినియోగించకూడదని హెచ్చరించారు. దీని పర్యవేక్షణ కోసం వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా యూరియాను వినియోగిస్తున్నట్లు తెలిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.