కృష్ణా: పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో పీఏసీఎస్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సం జరిగింది. కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా పీఏసీఎస్ కమిటీ సభ్యులు రైతులకు అండగా ఉంటూ..వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు.