Locations: Krishna

  • నేడు పీవీన్ మాధవ్ పర్యటన వివరాలు

    ఎన్టీఆర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ‘సారధ్యం’ యాత్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు విజయవాడకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తారు. కేబీఎన్ కాలేజీ నెహ్రూబొమ్మ సెంటర్‌వద్ద ఉదయం 10.15 గంటలకు శోభాయాత్రలో పాల్గొంటారు. 11.15 గంటలకు విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు సితారసెంటర్, ఎన్.కన్వెన్షన్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవసభలో పాల్గొననున్నట్లు సమాచారం.

     

  • విజయవాడకు చేరిన మాధవ్ ‘సారథ్యం‘

    ఎన్టీఆర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ‘సారథ్యం’యాత్ర విజయవాడకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆయన ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. ఉదయం 10గంటలకు నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాధవ్ నివాళులర్పించనున్నారు. 10.15గంటలకు శోభాయాత్రలో పాల్గొననున్నారు. 11.15గంటలకు పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం, సాయంత్రం 4గంటలకు సితార సెంటర్‌లోని ఎన్.కన్వెన్షన్‌లో ఉపాధ్యాయ దినోత్సవ సభలో పాల్గొననున్నట్లు అధికారులు మాధవ్ షెడ్యూల్‌ను వెల్లడించారు.

  • బిల్ కలెక్టర్‌పై దాడి.. డబ్బలు చెల్లించాలంటూ..!

    కృష్ణా: నాగాయలంకలో బిల్ కలెక్టర్ వెంకటేష్‌పై టీడీపీ నేత మండవ బాలవర్ధినరావు, తోట శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డారు. అప్పు తీసుకుని, వడ్డీతో పాటు అసలు చెల్లించినా, మళ్లీ డబ్బులు కావాలని బెదిరించి, తనపై దాడి చేసినట్లు వెంకటేష్ వాపోయారు. బాధితుడిని అతని సోదరుడు, తండ్రి రక్షించి అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

     

  • ఏ వంతెన కావాలో ఓటేయండి!

    AP : కృష్ణా నదిపై రాజధాని నుంచి విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారికి అనుసంధానించేందుకు ప్రభుత్వం ఐకానిక్‌ వంతెనను నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు నాలుగు డిజైన్లను ఎంపిక చేసింది. ఆధునిక ఇంజినీరింగ్‌ శైలిలో కూచిపూడి కళను మేళవించి అమరావతిని గుర్తుకు తెచ్చేలా వీటిని రూపొందించారు. ఎంపిక కోసం ఆయా డిజైన్లను CRDA వెబ్‌సైట్‌లో ఓటింగ్‌కు పెట్టారు.

     

  • గణనాథుడి ఆశీస్సులు పొందిన తంగిరాల

    ఎన్టీఆర్: చందర్లపాడు మండలం తుర్లపాడులో ఏర్పాటు చేసిన వినాయకుడిని గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దర్శించికున్నారు. గణనాథుడికి ఏర్పాటు చేసిన విశేష పూజలలో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజలు పాల్గొన్నారు.

  • భారీ ధర పలికిన వినాయకుడి లడ్డు..!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో శ్రీ బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విఘ్నేశ్వరుడి 11 కేజీల లడ్డు వేలం పాట నిర్వహించారు. మాదాని కుమార్ రూ.23,400లకు దక్కించుకున్నారు. నిమజ్జన నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీడీపీ మండల అధ్యక్షుడు కోగంటి బాబు పాల్గొన్నారు. వినాయకుడి విగ్రహాన్ని పురవీధులలో ఊరేగించారు.

  • ‘జాతీయ రహదార్ల అభివృద్ధితో పోర్టుల అనుసంధానం’

    కృష్ణా: కేంద్ర ప్రభుత్వ సహకారంతో మచిలీపట్నం పోర్టులో మౌలిక వసతులు కల్పిస్తామని, పూర్తి సామర్థ్యం గల పోర్టుగా తీర్చిదిద్దుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సారథ్యం శోభాయాత్రలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించిన మాధవ్, బందరు పోర్టును ఇతర పోర్టులు, ముఖ్య నగరాలతో అనుసంధానం చేసేలా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తామని అన్నారు.

  • అలా వచ్చే దొంగ స్వాములను నమ్మవద్దు..!

    కృష్ణా: బిచ్చగాళ్ల వేషధారణలో భిక్షాటనకు వచ్చే దొంగ స్వాములను ప్రజలు నమ్మవద్దని కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు. కోడూరు మండలంలో స్వాముల వేషధారణలో కొందరు భిక్షాటనకు వచ్చి అమ్మవారికి పూజ చేస్తానని ప్రజలను నమ్మించి వారి దగ్గర నగదు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. మూఢనమ్మకాలతో దొంగస్వాములను నమ్మి ప్రజలు మోసపోరాదని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.

  • గొట్టుముక్కలలో ఘనంగా వినాయకుని నిమజ్జనం

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సొసైటీ ఆలయ ఆవరణలో విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం అందంగా అలంకరించిన ట్రాక్టర్‌పై విద్యుత్ లైటింగ్, డీజే మేళతాళాలు, బాణాసంచాతో గ్రామ పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. కోలాటం, భక్తి పాటలతో భక్తులు ఆకర్షితులయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, గొడవలు లేకుండా నిమజ్జనం జరిగింది.

  • గ‌ణ‌ప‌తికి కేశినేని వెంక‌ట్ ప్ర‌త్యేక పూజ‌లు

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు వెంకట్‌ను ఘనంగా సత్కరించారు. 43వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసినందుకు, వినాయకుడిని రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించిన నిర్వాహకులను అభినందించారు.