ఎన్టీఆర్: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గగుడి కవాట బంధనంతో ఆలయం మూసివేస్తారని ఈవో శీనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం కవాట బంధనం చేసిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, లడ్డు, పులిహోర, అన్నప్రసాద తయారీ కేంద్రాలను కూడా మూసివేస్తారని పేర్కొన్నారు. 8న అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, హారతి అనంతరం సర్వదర్శనాన్ని ఉదయం 8:30 గంటలకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు.