ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాలలో వినాయక విగ్రహ ఊరేగింపులో రాళ్ల దాడి జరిగింది. ఊరేగింపు గ్రామం మధ్యలోకి రాగానే ఒక వర్గం రాళ్లతో దాడి చేశారని, ఎస్సై,సిబ్బంది అక్కడ ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూశారని వినాయక భక్తులు ఆరోపించారు. ఈదాడిలో కమిటీ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల భద్రతా లోపంపై నిరసనగా భక్తులు సుమారు 6గంటల పాటు ధర్నా నిర్వహించారు.
Locations: Krishna
-
కంచికచర్లలో భారీ ధర పలికిన గణేశ్ లడ్డూ
ఎన్టీఆర్: కంచికచర్ల వాణిజ్య గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం లడ్డు వేలం నిర్వహించారు. 27 కిలోల లడ్డును అయ్యప్ప మొబైల్ అధినేత శ్రీకాంత్ రూ.1,19,999కి దక్కించుకున్నారు. అలాగే, 9 కిలోల లడ్డును దేవిరెడ్డి శ్రీనివాసరావు రూ.30,000కు వేలంపాటలో సొంతం చేసుకున్నారు. ఈ వేలంపాటలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
సీజ్ చేసిన వాహనాలకు 9న వేలంపాట
ఎన్టీఆర్: మైలవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను ఈ నెల 9వ తేదీన బహిరంగ వేలంపాట పెడుతున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు మెంటర్ వాహనాల తనిఖీ అధికారి(ఎంవీఐ) ఆధ్వర్యంలో అప్సెట్ ప్రైస్ నిర్ణయించి వేలం పాట నిర్వహించడం జరుగుతుందన్నారు. మైలవరం ఎక్సైజ్ స్టేషన్లోని వాహనాలకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు.
-
వైభవంగా 72 అడుగుల డూండీ గణేష్ నిమజ్జనం
ఎన్టీఆర్: విజయవాడలో డూండీ గణేష్ సేవా సమితి తీర్చిదిద్దిన.. 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి పర్యావరణ హిత గణపతి విగ్రహ నిమజ్జనం శనివారం వైభవంగా నిర్వహించారు. విగ్రహం లోపల ముందే అమర్చిన పైపులతోపాటు..ఫైరింజన్ల ద్వారా నీటిని పంపి క్రతువు పూర్తి చేశారు. జన హృదయాల్లో కొలువైన భారీ గణనాథుడిని.. వేలాది భక్తులు తరలిరాగా.. విశేష కీర్తనలు, ప్రత్యేక పూజల నడుమ నిమజ్జనం చేశారు. డూండీ గణేశ్ సేవా సమితి పర్యవేక్షించగా, పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.
-
నేడు విజయవాడ దుర్గగుడి మూసివేత
ఎన్టీఆర్: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గగుడి కవాట బంధనంతో ఆలయం మూసివేస్తారని ఈవో శీనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం కవాట బంధనం చేసిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, లడ్డు, పులిహోర, అన్నప్రసాద తయారీ కేంద్రాలను కూడా మూసివేస్తారని పేర్కొన్నారు. 8న అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, హారతి అనంతరం సర్వదర్శనాన్ని ఉదయం 8:30 గంటలకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు.
-
భూపతి దంపతులకు ఎమ్మెల్యే పరామర్శ
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని 2వ వార్డులో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన దామాల భూపతి, సౌజన్య దంపతులను వారి స్వగృహంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలతో కలిసి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
-
ఘనంగా గణపతి నిమజ్జనం
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రూ. 3కోట్ల 10 లక్షల కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలంకరింపబడిన గణనాథుడి విగ్రహం శనివారం రాత్రి నిమజ్జన యాత్రకు శోభాయమానంగా బయలుదేరింది. ఈ యాత్రను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
-
వినాయక నిమజ్జనంలో ఘర్షణపై ఏసీపీ కీలక కామెంట్
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో జరిగిన ఘర్షణలపై నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్ స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని ఆయన తెలిపారు. ఘర్షణకు కారణమైన సమస్యను 24 గంటల్లోగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.
-
గంగమ్మ ఒడికి గండిగుంట బాల గణేష్
కృష్ణా: గండిగుంట పంచాయతీ వెంకటాపురంలో ఏర్పాటు చేసిన బాలగణేష్ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనానికి ముఖ్యఅతిథిగా ఉయ్యూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. గణేష్ను ఉంచిన ట్రాక్టర్ను ఆయన స్వయంగా నడిపి ఘన వీడ్కోలు పలికారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఛైర్మన్ ఆకాంక్షించారు. ఊరేగింపు ఉత్సాహంగా సాగింది.
-
కొండపల్లిలో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు
ఎన్టీఆర్: కొండపల్లిలోని సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ఘనంగా వీడ్కోలు పలికారు. విగ్రహ ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు, బొర్రా కిరణ్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అతిథులను సత్కరించారు.