ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో రైతులకు సాగునీరు అందించడంలో కీలకమైన కాచవరం సప్లై ఛానల్ డివైడింగ్ డ్యామ్ పరిస్థితిని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ.. ‘రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, డ్యామ్కు అవసరమైన మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి’ అని అధికారులను ఆదేశించారు.