Locations: Krishna

  • భక్తులకు అలర్ట్.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం మూసివేత

    కృష్ణా: మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు మూసివేశారు. గ్రహణం అనంతరం సోమవారం ఉదయం మహా సంప్రోక్షణ తర్వాత 10:00 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. సనాతన ఆనవాయితీ ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు.

     

  • పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా: వేమా కిషోర్

    ఎన్టీఆర్: కంచికచర్ల మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా మండల టీడీపీ అధ్యక్షుడు కోగంటి బాబు పాల్గొన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా వేమ కిషోర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా శేషం ప్రభాకర్ రావు ఎన్నికయ్యారు. అనంతరం కిషోర్ బాబు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలియజేశారు.

  • కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

    కృష్ణా: నందమూరు, కవిపురం, నందిగామ, ఎస్‌వీ పల్లి, కొంగంచెర్ల గ్రామాల్లో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆదివారం పర్యటించారు. నందమూరులో ప్రమాదానికి గురైన నీటి సంఘం అధ్యక్షుడు పరసా నాగరాజు, నందిగామలో మాతృమూర్తిని కోల్పోయిన టీడీపీ నాయకుడు అనగాని అంకాలరావుతో పాటు పలువురిని పరామర్శించారు. ఆయనతో జెడ్పీటీసీ అర్జా నగేష్, టీడీపీ నాయకులు ప్రసాద్, గూడవల్లి భద్రాచలం, యరగని నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

  • బాధిత కుటుంబానికి రూ.2లక్షల చెక్కు అందజేత

    కృష్ణా: పెడన మండలం కవిపురం పీఎసీఎస్ సభ్యుడు పుప్పాల మాణిక్యాలరావు మృతి చెందగా, జనతా ఇన్సూరెన్స్ పథకం కింద అతని భార్యకు రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అందజేశారు. మరో సభ్యుడు అచ్యుత వీరన్న మృతికి సొసైటీ తరపున మట్టి ఖర్చుల కోసం రూ.10,000 అందించారు. కార్యక్రమంలో నగేష్, ప్రసాద్, అధ్యక్షుడు శ్రీనివాసరావు, సర్పంచి స్వరూపారాణి, సీఈఓ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

  • ‘యూరియా గురించి ఆందోళన చెందవద్దు’

    కృష్ణా: పెడన నియోజకవర్గం గురివిందగుంట గ్రామంలో రైతులు యూరియా గురించి ఆందోళన చెందవద్దని, అన్ని సొసైటీలలో యూరియా స్టాక్స్ అందుబాటులో ఉన్నాయని, మరల యూరియా స్టాక్స్ వస్తాయని మండల వ్యవసాయ అధికారి ఎస్. జెన్నీ రైతులకు హామీ ఇచ్చారు. రైతులు నిర్ధారిత ధరలో యూరియా పొందవచ్చని, ఎటువంటి లోటు లేకుండా సరఫరా జరుగుతుందని తెలిపారు.

  • నిర్ణిత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు: DSP

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గని ఆత్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా సరఫరా విధానం, రికార్డులను విజిలెన్స్ డీఎస్పీ బంగారాజు పరిశీలించారు. రైతులు సమస్యలు ఎదుర్కొంటే మండల వ్యవసాయ అధికారిని లేదా జిల్లా కలెక్టరేట్ ఎరువుల కంట్రోల్ రూమ్(08672-252572)ను సంప్రదించాలన్నారు. యూరియా రూ.266.50 నిర్ణిత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఎరువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

  • తిరుపతమ్మ ఆలయం మూసివేత

    ఎన్టీఆర్: పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ ఆలయ ద్వారాలు మూసేసి భక్తుల దర్శనం నిలిపివేశారు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా దర్శనం నిలిపివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. మరలా సోమవారం ఉదయం 8 గంటల తర్వాత అమ్మవారి దర్శనం ప్రారంభిస్తామని ప్రకటించారు.

  • ‘అన్న‌దాత పోరు’కు త‌ర‌లిరండి

    కృష్ణా: రైతాంగ సమస్యలపై పోరాడేందుకు ఈ నెల 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల ఎదుట ‘అన్నదాత పోరు’ పేరుతో శాంతియుత నిరసన నిర్వహిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గుడివాడలోని వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన తెలియజేయడమే కార్యక్రమం లక్ష్యమని జిల్లా అధికారి ప్రతినిధి నారాయణరెడ్డి, నందివాడ మండలం ఎంపీపీ ఆదం, తదితరులు తెలిపారు.

  • పరిటాల గొడవను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు!

    కృష్ణా: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగిన రాళ్ల దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గొడవ జరుగుతుందని ముందుగా ఎస్సై ఎందుకు గుర్తించలేకపోయారని, స్పెషల్ బ్రాంచ్ నిఘా ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులు గుంపుగా రోడ్డుపైకి వచ్చినప్పుడు ఎస్సై ఎందుకు వెంటనే స్పందించలేదని, తగినంత భద్రత ఎందుకు కల్పించలేదని వినాయక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

    కృష్ణా: పెడనలోని 22వ వార్డులో గల తాడిశెట్టి సత్యనారాయణ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు క్షణాల్లోనే వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడగా, వారి ఆస్తి పూర్తిగా కాలిపోయింది. సర్వం కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది.