కృష్ణా: జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పల హారికపై దాడి చేయటం పిరికిపంద చర్య అని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి శామ్యూల్ మండిపడ్డారు. మహిళా అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిన గుండాలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సుపరిపాలన అంటే మహిళలపై దాడి చేయడమేనా.? ఈదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.