ఎన్టీఆర్: హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 15న తిరువూరులో జరగనున్న నాలుగవ మహాసభను విజయవంతం చేయాలని సీఐటీయూ సీనియర్ నాయకులు భద్రం, వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని, ముఠా కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.