కృష్ణా: గురు పౌర్ణమి సందర్భంగా కృష్ణాజిల్లా పెనమలూరులోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కానూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని మందిరానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబాకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.