Locations: Krishna

  • సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు స్మరించుకుంటూ..!

    ఎన్టీఆర్: మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.

     

  • ‘ఛలో విజయవాడ’కు తరలిరండి: SFI

    తిరుపతి: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యా రంగం సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 6వ తేదీన ఛలో విజయవాడకు వేలాది మంది విద్యార్థులు తరలిరావాలని చంద్రగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్స్ విడుదల చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు తేజ మాట్లాడుతూ.. పెండింగ్‌లో రూ.6400 కోట్ల బకాయిలు ఉండటంతో రాష్ట్రంలోని విద్యార్థులు తీవ్ర అవస్థలుపడుతున్నారని తెలిపారు.

  • రైతుల కష్టాలు.. యూరియా కోసం బారులు

    ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచి క్యూలు కట్టారు. అధికారులు ఒక్క కట్ట యూరియా మాత్రమే ఇస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్ని రోజులో ఈ యూరియా కష్టాలంటూ రైతులు వాపోతున్నారు.

     

  • ముస్లింలకు మొండితోక విషెస్

    ఎన్టీఆర్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నందిగామలో మిలాద్-ఉన్-నబి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్మోహన్‌రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించి, ప్రవక్త బోధనలను ప్రజలకు తెలియజేశారు.

     

     

  • ఆయన బోధనలు సదా ఆచరణీయం: MLA

    ఎన్టీఆర్: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సదా ఆచరణీయమన్నారు. సర్వశక్తివంతుడైన అల్లా ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నా అన్నారు.

     

     

  • ‘నా కుమారుడిని ఆదుకోండయ్యా..!’

    కృష్ణా: ఓపారిశుధ్య కార్మికురాలు తన కుమారుడి కోసం దాతల సాయం కోరుతుంది. చల్లపల్లిలోని నారాయణరావునగర్ ఎస్టీకాలనీలో నివసించే పారిశుధ్య కార్మికురాలు కుంభా సునీత కుమారుడు రవితేజ ఈఏడాది మార్చిలో జరిగిన రోడ్డుప్రమాదంలో కాళ్లు, చేతులు చచ్చుబడి వైద్యం చేయించుకునే స్థోమత లేక మంచానికి పరిమితమయ్యాడు. వైద్యనిమిత్తం దాతలు, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని వేడుకుంటుంది. 7842163961నంబర్‌కు ఫోన్‌పే, జీపే ద్వారా ఆర్థిక సాయం అందించాలని కోరింది.

  • PVN మాధవ్ ‘శోభాయాత్ర‘.. పార్టీకి బలం

    ఎన్టీఆర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ‘సారథ్యం’లో భాగంగా నిర్వహించే శోభాయాత్ర పార్టీకి బలం చేకూరుతుందని నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పిట్టల శ్రీదేవి పేర్కొన్నారు. కంచికచర్ల పట్టణం నుంచి విజయవాడలో జరిగే ‘సారథ్యం’ శోభాయాత్రకు పార్టీ నేతలు బయలుదేరారు. ఈ సందర్భంగా జెండా ఊపి ఆమె బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కాలవ మహేష్ బాబు పాల్గొన్నారు.

     

     

     

  • ఆయన జీవితం ఆదర్శం

    ఎన్టీఆర్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈద్-మిలాద్-ఉన్-నబి వేడుకలు కొండపల్లిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హజరత్ సయ్యద్ షాబుఖారి ఆస్థాన పీఠాధిపతులు అల్తాఫ్‌బాబా మహమ్మద్ ప్రవక్త చిహ్నంగా ఇస్లాం జెండాను ఆవిష్కరించారు. అనంతరం అజ్మీర్ దర్గా పీఠాధిపతులు సయ్యద్ సుల్తాన్ చిస్టీబాబా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వమానవాళికి శాంతి సందేశానిచ్చిన మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతిఒక్కరు శాంతి మార్గంలో పయనించాలన్నారు.

  • స్వచ్ఛందంగా విరాళాలు.. దాతలకు సత్కరాలు

    కృష్ణా: మోపిదేవిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రతిరోజూ భక్తులకు అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కొనసాగేందుకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. ఈక్రమంలో భీమవరం వాస్తవ్యులు ఆకులు వీరాస్వామిరాజా, పద్మజ దంపతులు భక్తిశ్రద్ధలతో నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ను ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు విరాళంగా అందించారు. దాతలను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

  • ‘ఆత్మ నిర్భర్ భారత్’ కోసం కలిసి అడుగులేద్దాం: మాధవ్

    ఎన్టీఆర్: ప్రజల నాడీ, వారి సమస్యలను తెలుసుకునేందుకే ‘చాయ్ పే చర్చ’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. విజయవాడలో పర్యటించిన ఆయన కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్‌లో నిర్వహించిన ‘చాయ్ పే చర్చ’లో పాల్గొని మాట్లాడారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం కలిసి అడుగులు వేద్దామన్నారు. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు.