ఎన్టీఆర్: మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.