ఎన్టీఆర్: విస్సన్నపేటలోని శ్రీ ఎదురు పలగాని వారి బజారులో గుంతలమయంగా ఉన్న రహదారిని లలితా రామకృష్ణ సౌజన్యంతో యాష్ గ్రావెల్ వేసి సరిచేశారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ నెక్కలపు వెంకటరావు, పలగాని మాధవరావు, వెంకటేశ్వరావు (గుమ్ము) పాల్గొన్నారు. ఈ మరమ్మతు పనులతో స్థానికులకు సౌకర్యవంతమైన రహదారి అందుబాటులోకి వచ్చింది.